క్రీడల్లో విద్యార్థుల ప్రతిభ
ABN , Publish Date - Sep 21 , 2024 | 12:23 AM
స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు అండర్-19 విభాగం బాలుర ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన షూటింగ్ బాల్, టేబుల్ టెన్నీస్ విభాగంలో ప్రతిభచాటారు.
ధర్మవరం, సెప్టెంబరు 20 : స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు అండర్-19 విభాగం బాలుర ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన షూటింగ్ బాల్, టేబుల్ టెన్నీస్ విభాగంలో ప్రతిభచాటారు. ఉమ్మడి జిల్లా స్థాయిలో అనంతపురంలో గురువారం జరిగిన టేబుల్ టెన్నీస్ విభాగం ఎంపిక పోటీలో పవనకుమార్, మంగళవారం నిర్వహించిన షూటింగ్బాల్ విభాగంలో చరణ్కుమార్ ప్రతిభచాటారు. విజయవాడలో శనివారం జరిగే టేబుల్ టెన్నీస్ పోటీల్లో పవనకు మార్, త్వరలో కర్నూల్లో జరిగే షూటింగ్ బాల్ పోటీల్లో చరణ్కుమార్ పాల్గొంటారు.