Share News

SCHOOL GAMES: విద్యార్థులు క్రీడల్లో రాణించాలి

ABN , Publish Date - Sep 27 , 2024 | 11:59 PM

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని టీడీపీ ఇనచార్జి గుమ్మనూరు నారాయణస్వామి అన్నారు. స్ధానిక ఎస్‌జేపీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నియోజకవర్గస్థాయి స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన ఆధ్వర్యంలో టోర్నమెంట్‌, ఎంపిక పోటీలను నిర్వహించారు.

SCHOOL GAMES: విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
Gummanur Narayanaswamy is the in-charge of TDP who is starting the contests

గుంతకల్లు టౌన, సెప్టెంబరు 27: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని టీడీపీ ఇనచార్జి గుమ్మనూరు నారాయణస్వామి అన్నారు. స్ధానిక ఎస్‌జేపీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నియోజకవర్గస్థాయి స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన ఆధ్వర్యంలో టోర్నమెంట్‌, ఎంపిక పోటీలను నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో తమ ప్రతిభ కనబరచాలన్నారు. అనంతరం క్రీడాపోటీలను ఆయన ప్రారంభించారు. గుంతకల్లు, గుత్తి, పామిడి మండలాలనుంచి 500 మంది విద్యార్థులు, పాల్గొన్నారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు బండారు ఆనంద్‌, కౌన్సిలర్‌ మహాలక్ష్మి, స్టాండింగ్‌ కౌన్సిల్‌ సభ్యుడు బీఎస్‌ కృష్ణారెడ్డి, తలారి మస్తానప్ప, ఎం రంగన్న, హనమంతు, అంజి, ఫజులు, ఇనచార్జి హెచఎం అరవింద్‌, సబిత, వేణుగోపాల్‌, పీడీ జ్యోతి పాల్గొన్నారు.

Updated Date - Sep 27 , 2024 | 11:59 PM