SURVEY: ముగిసిన గనుల సర్వే
ABN , Publish Date - Jun 06 , 2024 | 11:49 PM
అంతర్రాష్ట్ర సరిహద్దులో ఉన్న కర్ణాటక లీజు మైనింగ్ గనుల సర్వే గురువారం నాటితో ముగిసింది. వారంరోజుల పాటు కర్ణాటక, ఆంధ్ర సరిహద్దు ప్రాంతాలలో ఉన్న ఇనుపగనులలో పర్యటించిన కేంద్రబృందం సర్వే ప్రక్రియను పూర్తి చేసి నివేదికను సీఈసీకి సమర్పించనున్నట్లు.
రాయదుర్గం, జూన 6: అంతర్రాష్ట్ర సరిహద్దులో ఉన్న కర్ణాటక లీజు మైనింగ్ గనుల సర్వే గురువారం నాటితో ముగిసింది. వారంరోజుల పాటు కర్ణాటక, ఆంధ్ర సరిహద్దు ప్రాంతాలలో ఉన్న ఇనుపగనులలో పర్యటించిన కేంద్రబృందం సర్వే ప్రక్రియను పూర్తి చేసి నివేదికను సీఈసీకి సమర్పించనున్నట్లు ముఖ్యంగా కర్ణాటకకు సంబంధించిన టుముటి, విఠలాపురం, బేలూరు గ్రామాల పరిధిలో టీ నారాయణరెడ్డి, మహబూబ్ ట్రేడర్స్, హింద్ ట్రేడర్స్, బళ్లారి మైనింగ్ కంపెనీ, విబూదిగుడ్డ మైనింగ్ కంపెనీ, రత్నమైనింగ్, సుగులమ్మగుడ్డ మైనింగ్ గనుల లీజుల సరిహద్దులను సర్వే చేశారు. వీటిలో మూడు గనులకు సంబంధించి వారికి కేటాయించిన లీజులను ఆంధ్ర ప్రాంతంలో కొంతభాగం ఉన్నట్లు సర్వేబృందం నిగ్గుతేల్చినట్లు తెలియవచ్చింది. కర్ణాటక ప్రభుత్వం లీజులను పునరుద్ధరించేందుకు చేపట్టిన సర్వేలో సుమారు 300 మీటర్ల దాకా అంతర్రాష్ట్ర సరిహద్దులో చొరబడినట్లు తెలుస్తోంది. కాకపోతే దీనిపై లీజులు కేటాయింపు సమయానికి ఇరురాషా్ట్రల సరిహద్దులు వివాదంలో ఉండేది. సర్వే ప్రక్రియకు సంబంధించి పూర్తిస్థాయి నివేదికను రెండురోజుల్లో సిద్ధం చేస్తున్నట్లు బృందం సభ్యులు తెలిపారు. సర్వే కార్యక్రమంలో డీఎ్ఫఓ వినీతకుమార్, డీఎ్సఎల్ఓ రూప్లానాయక్, మైనింగ్ సర్వేయర్ భాస్కర్రెడ్డి, అహూడా సర్వేయర్ శరతబాబు, కర్ణాటక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాజు, సీనియర్ జియాజిలిస్తు చంద్రు, జేఈ నవీన, మండల సర్వేయర్ రవితేజ తదితరులు పాల్గొన్నారు.