Share News

విశకర్మయోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోండి

ABN , Publish Date - Sep 21 , 2024 | 12:22 AM

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వకర్మయోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఎంఎస్‌ పార్థసారధి పేర్కొన్నారు.

విశకర్మయోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోండి
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే పార్థసారధి

కదిరి అర్బన, సెప్టెంబరు 20 : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వకర్మయోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఎంఎస్‌ పార్థసారధి పేర్కొన్నారు. శుక్రవారం ఈ పథకం కింద శిక్షణ పొందినవారికి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ చేతి, కులవృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నవారిలో సామర్థ్యం మెరుగుపరచి, ఉత్పదకత నాణ్యత, ఉత్పత్తులను పెంచడమే ఈపథకం ఉద్దేశమన్నారు.


ఈ పథకంలో చేరడం వలన విశ్వకర్త సర్టిఫికెట్‌, ఐడీ కార్డుతోపాటు నైపుణ్యత పొపెందిం చుకోవడానికి కావలసిన శిక్షణ, టూల్‌ కిట్లు, రుణ సదుపాయం, మార్కెటింగ్‌ చేసుకోవడానికి ప్రభుత్వం మద్దతు లభిస్తుందన్నారు. 18 సంవత్సరాలు పైబడిన కుటుంబంలో ఒకరు మాత్రమే అర్హులన్నారు. విద్యార్హత లేకున్నా, పేర్లు నమోదు చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రమేష్‌బాబు, హసనాపురం చంటి, క్రిష్ణవేణి, మేనేజర్‌ ధనుంజయ్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2024 | 12:22 AM