మహిళల అభ్యున్నతే టీడీపీ ధ్యేయం
ABN , Publish Date - Mar 01 , 2024 | 12:17 AM
ధర్మవరం, ఫిబ్రవరి 29: మహిళాల అభ్యున్నతే టీడీపీ ధ్యేయమని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి పరిటాల శ్రీరామ్ సతీమణి పరిటాల జ్ఞాన పేర్కొన్నారు.
- పరిటాల జ్ఞాన
- ధర్మవరంలో భవిష్యత్తుకు గ్యారెంటీ నిర్వహణ
-పెద్దఎత్తున తరలివచ్చిన తెలుగు మహిళలు
ధర్మవరం, ఫిబ్రవరి 29: మహిళాల అభ్యున్నతే టీడీపీ ధ్యేయమని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి పరిటాల శ్రీరామ్ సతీమణి పరిటాల జ్ఞాన పేర్కొన్నారు. స్థానిక శివానగర్లోని శివాలయంలో స్వామివారికి ఆమె రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి, అక్కడి నుంచి బాబుష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆమెతో పాటు తెలుగుమహిళలు ఇంటింటికీ వెళ్లి సూపర్సిక్స్ పథకాలతో కలిగే లబ్ధిని వివరించారు. పరిటాల జ్ఞాన మాట్లాడుతూ.. డ్వాక్రా వ్యవస్థను తీసుకొచ్చి, మహిళాభివృద్ధికి బాటలు వేసింది చంద్రబాబునాయుడు అన్నారు. టీడీపీని గెలిపించుకుంటే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, అమ్మకు వందనం కింద రూ.15వేలు, 18 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు రూ.1500 ఇస్తారన్నారు. మహిళలకు ఉపాధి కల్పించే దిశగా స్టిచ్చింగ్ యూనిట్లను పరిటాల శ్రీరామ్.. ధర్మవరానికి తీసుకొస్తారన్నారు. కార్యక్రమంలో తెలుగు మహిళలు ముతుకూరు బీబీ, పద్మావతి, బాను, స్వర్ణకుమారి, మున్నీ, చౌడమ్మ, కత్తుల సునీత, శారద, వెంకటలక్ష్మి, ప్యారిమా, టీడీపీ నాయకులు ఎల్ నరేంద్రచౌదరి, ఫణికుమార్, మహేశ చౌదరి, బీరే గోపాలక్రిష్ణ, కాచర్ల కంచన్న, కేశగాళ్ల శీనా, పల్లపు రవీంద్ర పాల్గొన్నారు.