రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యo
ABN , Publish Date - Apr 13 , 2024 | 12:06 AM
ఆంధ్రరాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మాజీ మంత్రి సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కె.సుధాకర్ అన్నారు.
సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి
గుడిబండ, ఏప్రిల్ 12: ఆంధ్రరాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మాజీ మంత్రి సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కె.సుధాకర్ అన్నారు. శుక్రవారం మండలంలోని కె.ఎన.పల్లి, చిగతుర్పి, తాళికెర, టీ.డి.పల్లి, బళ్లేకట్ట తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించి హస్తం గుర్తుకు ఓటువేసి సుధాకర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ నాగరాజు, నాయకులు ఎల్.కె.నరసింహప్ప, నాయకులు నాగభూషణ, డి.హెచ.రాయుడు పాల్గొన్నారు.