ఆసుపత్రిని తనిఖీ చేసిన స్పెషలాఫీసర్
ABN , Publish Date - Jul 27 , 2024 | 12:09 AM
మండలంలోని కొండాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని స్పెషాలాఫీసర్, డిపీఓ విజయ్కుమార్రెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన రోగులను పలకరించి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టోర్రూంను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు.
గోరంట్ల, జూలై 26: మండలంలోని కొండాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని స్పెషాలాఫీసర్, డిపీఓ విజయ్కుమార్రెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన రోగులను పలకరించి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టోర్రూంను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. ప్రభుత్వ నిధుల మంజూరు, మందుల సరఫరాపై వైద్యులు సాయిసుప్రిత, మాధవిలతో ఆయన చర్చించారు. మల్లెల గ్రామం, గౌనివారిపల్లిలో పారిశుధ్య పనులను పరిశీలించారు. గోరంట్ల డపింగ్యార్డుకు వెళ్లి తడి, పొడి చెత్తను వేరు చేసి వర్మీకంపోస్టును తయారు చేయించాలని, కార్యదర్శి బాబురావును ఆదేశించారు. ఈఓఆర్డీ సుధాకర్, కార్యదర్శులు శంకర్, మస్తాన, పంచాయతీ కార్మికులున్నారు.
ి