బడుగుల సంక్షేమం టీడీపీతోనే సాధ్యం: కందికుంట
ABN , Publish Date - Feb 25 , 2024 | 12:29 AM
కదిరిఅర్బన, ఫిబ్రవరి 24: బడుగు, బలహీనవర్గాల సంక్షేమం టీడీపీతోనే సాధ్యమని ఆ పార్టీ నియోజకవర్గ ఇనచార్జి కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు.
కదిరిఅర్బన, ఫిబ్రవరి 24: బడుగు, బలహీనవర్గాల సంక్షేమం టీడీపీతోనే సాధ్యమని ఆ పార్టీ నియోజకవర్గ ఇనచార్జి కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భా గంగా మండలంలోని పట్నం గ్రామంలో శనివా రం ఆయన పర్యటించారు. మహిళలు, యువత పెద్దఎత్తున స్వాగతం పలికారు. తర్వాత కందికుంట ఇంటింటికీ తిరుగుతూ చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టో పథకాలను ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని బలపరచి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకుందామని పిలుపునిచ్చారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమని తెలిపారు. బడుగులు టీడీపీకి అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ చెన్నకేశవులు, నాయకులు హరి, కృష్ణమూర్తి, శంకర్, అహమ్మద్వలి, రాజు, చంద్ర, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.