బాధ్యతాయుతంగా పనిచేయాలి: ఆర్డీవో
ABN , Publish Date - Apr 03 , 2024 | 12:02 AM
ఎన్నికల ప్రక్రియలో భాగంగా బీఎల్వోలు సంబం ధిత అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆర్డీవో రాణి సుష్మిత పేర్కొన్నారు.
కుందుర్పి, ఏప్రిల్ 2: ఎన్నికల ప్రక్రియలో భాగంగా బీఎల్వోలు సంబం ధిత అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆర్డీవో రాణి సుష్మిత పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో బీఎల్వోలు సెక్టార్ అధికారులు, సూపర్వైజర్లతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లో సరైన వసతులు, దివ్యాంగులు ఓటు హక్కును ఇంటి దగ్గరే వినియోగించు కునే విధంగా తగు ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశులు, తహసీల్దార్ హనుమంతు, ఎంపీడీవో చంద్రశేఖర్, ఎంఈఓ తిప్పేస్వామి, బీఎల్వోలు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.