టీడీపీతోనే మైనార్టీల అభ్యున్నతి: సవిత
ABN , Publish Date - Mar 22 , 2024 | 11:43 PM
రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీల అభ్యున్నతి టీడీపీతోనే సాధ్యమని, వారి సంక్షేమానికి పార్టీ పెద్ద పీట వేస్తుందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత పేర్కొన్నారు.
పెనుకొండ టౌన, మార్చి 22 : రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీల అభ్యున్నతి టీడీపీతోనే సాధ్యమని, వారి సంక్షేమానికి పార్టీ పెద్ద పీట వేస్తుందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత పేర్కొన్నారు. ఆమె శుక్రవారం పట్టణంలోని దర్గాపేటలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సవిత మాట్లాడుతూ ము స్లింల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ మైనార్టీలకు ఏం చేసిందని ప్రశ్నిం చారు. టీడీపీ హయాంలో ఇంజనీరింగ్ కళాశాలలు, హజ్ హౌస్లు, షాదీఖానా లు నిర్మించిన ఘనత తమదే అన్నారు. వైసీపీ ప్రభుత్వం కేవలం ఆర్భాటం తప్ప రాష్ట్రానికి, ముస్లిం మైనార్టీలకు ఒరగబెట్టిందేమీ లేదని మైనార్టీ నాయకులు అ న్నారు. రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వానికి ముస్లింలు బుద్ధిచెప్పడం ఖాయ మన్నా రు. టీడీపీ హయాంలో దుల్హన పథకం ద్వారా ముస్లిం యువతుల వివాహాని రూ.50వేలు అందిస్తే.. జగన తాను అధికారంలోకి వస్తే రూ.లక్ష ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే అధికారంలోకి వచ్చాక ఆ పథకానికి పలు నిబంధనలు పెట్టి నీరుగార్చారన్నారు. ఇస్లామిక్ బ్యాంక్లు ఏర్పాటు చేసి వడ్డీలేని రుణాలు ఏర్పాటు చేస్తామని మోసం చేశారన్నారు. సీఎం జగన ముస్లింల ద్రోహి అన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకుడు దాదు, షౌకత, మాజీ మండల కన్వీనర్ శ్రీరాములు, జిల్లా అధికార ప్రతినిధి రఘువీరచౌదరి, తదితరులు పాల్గొన్నారు.
టీడీపీలోకి 40కుటుంబాల చేరిక : మండలకేంద్రమైన సోమందేపల్లికి చెందిన 40 కుటుంబాలు శుక్రవారం వైసీపీని వీడి టీడీపీలోకి చేరాయి. పట్టణంలో ని టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత వారికి కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో గాజుల ప్రసాద్, మనోహర్, బుల్లెట్ వెంకటేశు, శ్రీనివాసులు, తేజ, నక్కలగుట్ట రామచంద్ర, గాజుల నవీన, రామక్రిష్ణ, గాజుల హరీష్, రామక్రిష్ణ, సురేంద్ర, జగన్నాథ్ తదితరులు ఉన్నారు.