DMHO: శాస్త్రీయ పద్ధతిలోనే వ్యర్థాలను డిస్పోజ్ చేయాలి
ABN , Publish Date - Aug 10 , 2024 | 11:58 PM
శాస్త్రీయ పద్ధతిలోనే బయోమెడికల్ వ్యర్థ పదార్థాలను డిస్పోజ్ చేయాలని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలకు డీఎంహెచఓ డాక్టర్ ఈబీ దేవి ఆదేశించారు. శనివారం నగరంలోని యశోదా ఆస్పత్రిని ఆమె తనిఖీ చేశారు.
అనంతపురం టౌన, ఆగస్టు 10: శాస్త్రీయ పద్ధతిలోనే బయోమెడికల్ వ్యర్థ పదార్థాలను డిస్పోజ్ చేయాలని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలకు డీఎంహెచఓ డాక్టర్ ఈబీ దేవి ఆదేశించారు. శనివారం నగరంలోని యశోదా ఆస్పత్రిని ఆమె తనిఖీ చేశారు. ఆస్పత్రి నిర్వహణ, వ్యర్థపదార్థాలు ఎలా డిస్పోజ్ చేస్తున్నారు తదితర విషయాలను ఆరాతీసి పరిశీలించారు. డీఎంహెచఓ మాట్లాడుతూ వ్యర్థపదార్థాలు సక్రమంగా డిస్పోజ్ చేయడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ప్రతి ప్రైవేట్ ఆస్పత్రి వ్యర్థ పదార్థాలను బయోమెడికల్ వేస్ట్ మేనేజ్చెంట్ అనుసంధానమై శాస్త్రీయ పద్ధతిలో వ్యర్థపదార్థాలను డిస్పోజ్ చేయాల్సిందేనన్నారు. అందులో వేసిన వ్యర్థపదార్థాలను బయోమెడికల్ డిస్పోజిల్ప్రాంతానికి ఒప్పందం ప్రకారం పంపించాలని సూచించారు. ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు ఆయా ఆస్పత్రులపై తీసుకుంటామని డీఎంహెచఓ హెచ్చరించారు. కార్యక్రమంలో డెమో త్యాగరాజు పాల్గొన్నారు.