జనసేనలోకి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ద్రోణా
ABN , Publish Date - Apr 22 , 2024 | 12:42 AM
వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ద్రోణా వెంకటేష్ జనసేన పార్టీలోకి చేరారు. అనంతపురం నగరానికి చెందిన ద్రోణా ఆదివారం పిఠాపురంలోని పవనకళ్యాణ్ నివాసంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
అనంతపురం ప్రెస్క్లబ్, ఏప్రిల్ 21: వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ద్రోణా వెంకటేష్ జనసేన పార్టీలోకి చేరారు. అనంతపురం నగరానికి చెందిన ద్రోణా ఆదివారం పిఠాపురంలోని పవనకళ్యాణ్ నివాసంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అధినేత పవనకళ్యాణ్ వెంకటేష్కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల తరుపు ప్రచారంలో పాల్గొని వారి గెలుపునకు కృషి చేయాలని పవనకళ్యాణ్ సూచించినట్లు వెంకటేష్ తెలిపారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం...