Share News

Youth suicide యువకుడి ఆత్మహత్య

ABN , Publish Date - Sep 21 , 2024 | 12:53 AM

మండలంలోని లింగంపల్లి గ్రామంలో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. లింగంపల్లికి చెందిన ఎల్లప్ప, శుక్లమ్మకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. పెద్ద కుమారుడు హనుమంతరాయుడు(29) తండ్రికి చేదోడుగా వ్యవసాయ పనులకు వెళ్తుండేవాడు.

Youth suicide యువకుడి ఆత్మహత్య

డీ.హీరేహాళ్‌, సెప్టెంబరు 20: మండలంలోని లింగంపల్లి గ్రామంలో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. లింగంపల్లికి చెందిన ఎల్లప్ప, శుక్లమ్మకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. పెద్ద కుమారుడు హనుమంతరాయుడు(29) తండ్రికి చేదోడుగా వ్యవసాయ పనులకు వెళ్తుండేవాడు.


కాగా కొన్ని రోజులుగా అతడికి ఆరోగ్యం సరిగా లేదు. ఈ క్రమంలో వివాహం కూడా కాలేదు. దీంతో జీవితంపై విరక్తి చెందిన అతను గురువారం పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు. అనంతరం అదే గ్రామంలో ఉన్న తన చెల్లి తిప్పమ్మ ఇంటి వద్దకు వచ్చి విషయం చెప్పాడు. వెంటనే ఆమె కుటుంబసభ్యులకు తెలియజేయగా వారు అతన్ని చికిత్స కోసం బళ్లారి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి సమయంలో మృతి చెందాడు. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి తెలిపారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Sep 21 , 2024 | 12:53 AM