Share News

AP Election Polling 2024: తాడిపత్రిలో ఫ్యాక్షన్ సినిమాకు మించిన సీన్.. టెన్షన్ టెన్షన్..

ABN , Publish Date - May 13 , 2024 | 12:22 PM

దేశవ్యాప్తంగా ఓటింగ్ మొదలైంది. ఓటర్లు ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెళుతున్నారు. పలుచోట్ల ఈవీఎంలు మొరాయిస్తుంటే, మరికొన్నిచోట్ల వర్షం కారణంగా కాస్త ఆలస్యంగా మొదలైంది పోలింగ్, ఇక పోలింగ్ బూత్ సమీపంలో చెదురు మొదురు ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.

AP Election Polling 2024: తాడిపత్రిలో ఫ్యాక్షన్ సినిమాకు మించిన సీన్.. టెన్షన్ టెన్షన్..
AP Election Polling 2024:

దేశవ్యాప్తంగా ఓటింగ్ మొదలైంది. ఓటర్లు ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెళుతున్నారు. పలుచోట్ల ఈవీఎంలు మొరాయిస్తుంటే, మరికొన్నిచోట్ల వర్షం కారణంగా కాస్త ఆలస్యంగా మొదలైంది పోలింగ్, ఇక పోలింగ్ బూత్ సమీపంలో చెదురు మొదురు ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పలుచోట్ల దాడులు, కిడ్నాపుల మధ్య పోలింగ్ ఆసక్తికరంగా జరుగుతుంది. ఇక అనంతపురం తాడిపత్రిలో ఫ్యాక్షన్ సినిమాకు మించిన సీన్లు కనిపిస్తున్నాయి.

ఒకే పోలింగ్ బూత్‌లో ఎదురుపడ్డ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి (MLA Pedda reddy) ఒకరిని చూస్తూ మరొకరు ఎదురెదురుగా నిలబడ్డారు. ఈ ఇద్దరి నేతల మధ్య ఏం జరగబోతుందోననే టెన్షన్ వాతావరణం అక్కడి వారందరిలో నెలకొంది. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వెనక్కు తగ్గని నేతలు.. మరికాసేపట్లో అక్కడ ఏం జరగబోతుందోనని అటు పోలీసులు, ఇటు ఓటర్లు ఆందోళన చెందారు.

AP Elections Polling 2024: పలు చోట్ల ఇంకా ప్రారంభం కాని పోలింగ్.. ఓటర్ల ఆగ్రహం..!

పోలీసులు ముందుకు వెళ్ళమంటున్నా ముందు అతన్నే పంపాలని ఎమ్మెల్యే పెద్దారెడ్డి అన్నారు. దీనికి లేదు ముందు పెద్దారెడ్డిని పంపాలని ప్రభాకర్ రెడ్డి (Prabhakar reddy) వాదులాడుకున్నారు. ఈ సీన్‌తో అక్కడ కాసేపు వాదనతో కూడిన వాతావరణం నెలకొంది. చూసేవారికి ఫ్యాక్షన్ సన్నివేశం చూస్తున్న ఫీలింగ్ కలిగింది.

Updated Date - May 13 , 2024 | 12:22 PM