Share News

Andhra Pradesh: వైసీపీతో ముస్లింలకు తీరని నష్టం

ABN , Publish Date - May 10 , 2024 | 05:04 AM

జగన్మోహన్‌రెడ్డి ముస్లింల ద్రోహి. ఆయన సీఎం అయ్యాక ముస్లింలకు ఏ సంక్షేమ కార్యక్రమం అమలు చేయకపోగా ట్రిపుల్‌ తలాక్‌కు, బీజేపీ చేస్తున్న నల్ల చట్టాలకు మద్దతు పలికారు.

Andhra Pradesh: వైసీపీతో ముస్లింలకు తీరని నష్టం

జగన్మోహన్‌రెడ్డి ముస్లింల ద్రోహి. ఆయన సీఎం అయ్యాక ముస్లింలకు ఏ సంక్షేమ కార్యక్రమం అమలు చేయకపోగా ట్రిపుల్‌ తలాక్‌కు, బీజేపీ చేస్తున్న నల్ల చట్టాలకు మద్దతు పలికారు. వైసీపీ ప్రభుత్వంలో ముస్లింలకు చాలా నష్టం జరిగింది. ఒక్క చాన్స్‌ అని చెప్పి ముస్లింలను నట్టేట ముంచారు. దుల్హన్‌ పథకాన్ని, ముస్లింల విదేశీ విద్య పథకాలను తీసేశారు. ముస్లింలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్‌ను కాపాడిన వ్యక్తి చంద్రబాబు.

జగన్మోహన్‌రెడ్డి ఆ రిజర్వేషన్‌ను తీసివేయాలని చూశారు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలు.. నవరంధ్రాలుగా మారాయి. రాష్ట్రంలో ఇసుక మాఫియా, మందు మాఫియాకు తోడు చేపలు కూడా అమ్ముకుంటున్నారు. ప్రజల ఆస్తులు కూడా జగన్‌ చేతుల్లో ఉంచేందుకు జీవో తెస్తున్నారు. జగన్‌ వల్ల రాష్ట్రం సర్వనాశనం అయ్యింది. ఆయన, ఆయన బృందం చేస్తున్న ఆగడాలకు ఇకనైనా ముగింపు పలకాలి.

- అచ్చంపేట

Updated Date - May 10 , 2024 | 05:04 AM