Share News

మినీ లారీని ఢీకొన్న లారీ

ABN , Publish Date - Mar 08 , 2024 | 12:54 AM

పూతలపట్టు మండలంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది స్వల్పంగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

మినీ లారీని ఢీకొన్న లారీ
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు

ఎనిమిది మందికి స్వల్ప.. ఒకరికి తీవ్రగాయాలు

పూతలపట్టు, మార్చి 7: పూతలపట్టు మండలంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది స్వల్పంగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వావిల్‌తోట పంచాయతీ మూర్తిగానివూరుకు చెందిన తొమ్మిది మంది మహిళలు చిత్తూరు- తిరుపతి జాతీయ రహదారిలోని డివైడర్ల మధ్యలో వున్న గడ్డిని తొలగించేందుకు మినీలారీలో రంగంపేట క్రాస్‌ రోడ్డు సమీపాన వెళుతున్నారు. అదే సమయంలో తిరుపతి వైపు వెళ్తున్న లారీ వెనుకవైపు నుంచి ఢీకొంది. మినీలారీ నుంచి కిందపడిన సుశీల, అమృతవల్లి, లత, అంగమ్మ, కుప్పమ్మ, విజయ, వళ్ళెమ్మ, ఉష, రూపమ్మ గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారిలో సుశీలమ్మకు తీవ్ర గాయాలవ్వడంతో వేలూరు సీఎంసీకి తరలించారు. ఈ మేరకు పూతలపట్టు సీఐ సుదర్శన ప్రసాద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Mar 08 , 2024 | 12:54 AM