రోడ్డు భద్రతా మాసోత్సవాల వాల్పోస్టర్ల ఆవిష్కరణ
ABN , Publish Date - Jan 21 , 2024 | 12:22 AM
రోడ్డు భద్రతా మాసోత్సవాల వాల్పోస్టర్లు, కరపత్రాలను జిల్లా పోలీసు గ్రౌండ్లో కలెక్టర్ షన్మోహన్, ఎస్పీ రిషాంత్ రెడ్డి శనివారం ఆవిష్కరించారు.
చిత్తూరు సిటీ, జనవరి 20: రోడ్డు భద్రతా మాసోత్సవాల వాల్పోస్టర్లు, కరపత్రాలను జిల్లా పోలీసు గ్రౌండ్లో కలెక్టర్ షన్మోహన్, ఎస్పీ రిషాంత్ రెడ్డి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రవాణా శాఖ ఆధ్వర్యంలో ఏటా రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో డీటీసీ నిరంజన్ రెడ్డి, ఆర్టీవో సునీల్ కుమార్, ఎంవీఐలు వాసుదేవరెడ్డి, మురళి, దీపిక, ఏఎంవీఐ ప్రసాద్ వర్మ, ఎస్ఐ రాజు తదితరులు పాల్గొన్నారు.