Share News

చిత్తూరు ఎస్పీగా మణికంఠ

ABN , Publish Date - Apr 05 , 2024 | 01:38 AM

చిత్తూరు ఎస్పీగా మణికంఠ చండోలును ప్రభుత్వం నియమించింది. ఇక్కడ ఎస్పీగా ఉన్న జాషువాపై ఎన్నికల కమిషన్‌ బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే.

చిత్తూరు ఎస్పీగా మణికంఠ

చిత్తూరు, ఏప్రిల్‌ 4: చిత్తూరు ఎస్పీగా మణికంఠ చండోలును ప్రభుత్వం నియమించింది. ఇక్కడ ఎస్పీగా ఉన్న జాషువాపై ఎన్నికల కమిషన్‌ బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో విజయవాడ సిటీ లా అండ్‌ ఆర్డర్‌ విభాగ డిప్యూటీ కమిషనరుగా విధులు నిర్వహిస్తున్న మణికంఠ చండోలును బదిలీ చేశారు. ఈయన 2018 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. గతంలో గ్రేహౌండ్స్‌ విభాగంలో అసాల్డ్‌ కమాండెంట్‌గా, శ్రీకాకుళం జిల్లా సెబ్‌ ఏఎస్పీగా విధులు నిర్వహించారు. మొదటిసారిగా ఎన్నికల కమిషన్‌ నేరుగా జిల్లా ఎస్పీగా నియమించింది.

Updated Date - Apr 05 , 2024 | 01:38 AM