Share News

మినీ లారీ, లగేజీ వ్యాన్‌ ఢీ

ABN , Publish Date - Feb 05 , 2024 | 01:05 AM

మినీ లారీ, లగేజీ వ్యాన్‌ ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదం చిత్తూరు నగరం పలమనేరు రోడ్డులో ఆదివారం వేకువజామున చోటుచేసుకుంది.

మినీ లారీ, లగేజీ వ్యాన్‌ ఢీ
ప్రమాదానికి గురైన వాహనాలు

ముగ్గురికి తీవ్ర గాయాలు

చిత్తూరు, ఫిబ్రవరి 4: మినీ లారీ, లగేజీ వ్యాన్‌ ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదం చిత్తూరు నగరం పలమనేరు రోడ్డులో ఆదివారం వేకువజామున చోటుచేసుకుంది. ట్రాఫిక్‌ ఎస్‌ఐ బాబు తెలిపిన ప్రకారం.. పలమనేరు, గంగవరం మండలాలకు చెందిన అహ్మద్‌ బాషా, రషీద్‌ అహ్మద్‌, అస్లాం బాషా లగేజీ వ్యాన్‌లో పలమనేరు నుంచి చిత్తూరుకు బయలుదేరింది. తమిళనాడుకు చెందిన మినీలారీ పలమనేరుకు వెళ్లే క్రమంలో పలమనేరురోడ్డులోని చర్చి వద్ద ఈ రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో అహ్మద్‌ బాషా, రషీద్‌ అహ్మద్‌, అస్లాం బాషాకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Updated Date - Feb 05 , 2024 | 01:05 AM