ఎన్డీయే సంబరాలు
ABN , Publish Date - Jun 05 , 2024 | 02:16 AM
ఎన్డీయే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఘన విజయం సాధించడంపై అంబరాలు సంబరాన్ని అంటాయి. రేణిగుంట రోడ్డులోని టీడీపీ పార్లమెంటు కార్యాలయంలో మంగళవారం విజయోత్సవ సంబరాలు జరిగాయి.
తిరుపతి, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): ఎన్డీయే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఘన విజయం సాధించడంపై అంబరాలు సంబరాన్ని అంటాయి. రేణిగుంట రోడ్డులోని టీడీపీ పార్లమెంటు కార్యాలయంలో మంగళవారం విజయోత్సవ సంబరాలు జరిగాయి. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడు నరసింహ యాదవ్, శ్రీధర్వర్మ తదితతరులు చంద్రబాబు కటౌట్కు పాలాభిషేకం చేశారు. కేక్ కట్చేసి పార్టీ శ్రేణులకు తినిపించారు. జిల్లాలో అన్ని పార్లమెంటు స్థానాలు ఎన్డీఏ కైవసం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. అరాచకపాలనకు చరమగీతం పడిందన్నారు. ఈకార్యక్రమంలో నాయకులు ఊట్ల సురేంద్ర నాయుడు, పుష్పావతి, రుద్రకోటి సదాశివం, మనోహరాచారి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా సుగుణమ్మ నివాసం వద్ద పార్టీ శ్రేణులు కేక్ కట్చేసి విజయోత్సవాలు చేసుకున్నారు. విజేత ఆరణి శ్రీనివాసులు పార్టీ నాయకులతో కలసి అలిపిరి వద్ద టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. 62వేల పైచిలుకు మెజారిటీతో గెలుపొందడంపై కౌంటింగ్ కేంద్రం వద్ద పెద్దఎత్తున పార్టీ శ్రేణులు చేరుకునే ప్రయత్నం చేశాయి. అయితే పటిష్ఠ బందోబస్తు ఉండటంతో అక్కడవరకు వెళ్లలేకపోయారు.