జిల్లా టీడీపీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు
ABN , Publish Date - Jan 01 , 2024 | 12:26 AM
టీ డీపీ చిత్తూరు అసె ంబ్లీ టికెట్ ఎవరికిచ్చినా గెలిపించుకుం టామని మాజీ జడ్పీ చైర్పర్సన్ గీర్వాణి చంద్రప్రకాష్ అన్నారు.
ఎమ్యెల్యే టికెట్ ఎవరికిచ్చినా గెలిపించుకుంటాం: గీర్వాణి చంద్రప్రకాష్
చిత్తూరు సిటీ, డిసెంబరు 31: టీ డీపీ చిత్తూరు అసె ంబ్లీ టికెట్ ఎవరికిచ్చినా గెలిపించుకుం టామని మాజీ జడ్పీ చైర్పర్సన్ గీర్వాణి చంద్రప్రకాష్ అన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆదివారం రాత్రి 2024 నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయానికి విద్యుద్దీపాలంకరణ చేశారు బాణాసంచా పేల్చి, పార్టీ నేతలు, కార్యకర్తల నడుమ నూతన సంవత్సర కేక్ కట్చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్, ఉపాధ్యక్షుడు కాజూరు బాలాజి, మాజీ మేయర్ కటారి హేమలత, వైవీ రాజేశ్వరి, నేతలు బద్రి నారాయణ, గురజాల జగన్మోహన్, గురజాల చెన్నకేశవ నాయుడు, సుబ్బానాయుడు, చిట్టిబాబు, కాజూరు రాజేష్, జనసేన నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.