చిత్తూరులో టీడీపీ ఆశావహుల అభిప్రాయ సేకరణ
ABN , Publish Date - Feb 15 , 2024 | 12:34 AM
చిత్తూరు అసెంబ్లీకి టీడీపీ నుంచి టిక్కెట్ ఆశిస్తున్న వారితో ఆ పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు మునిరామయ్య బుధవారం మాట్లాడారు.
చిత్తూరు సిటీ, ఫిబ్రవరి 14: చిత్తూరు అసెంబ్లీకి టీడీపీ నుంచి టిక్కెట్ ఆశిస్తున్న వారితో ఆ పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు మునిరామయ్య బుధవారం మాట్లాడారు. విడి విడిగా వారితో సమావేశమై అభిప్రాయ సేకరణ జరిపారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు జిల్లా పార్టీ కార్యాలయంలో యన వారి అభిప్రాయాలు సేకరించారు. గురజాల జగన్మోహన్, కటారి హేమలత, కాజూరు బాలాజి, సీఆర్ రాజన్తో మాట్లాడారు. వారి అభిప్రాయాలు తీసుకున్నారు. కాగా చంద్రప్రకాష్, తేజస్విని అందుబాటులో లేకపోవడంతో గురువారం వారితో మాట్లాడే అవకాశం ఉంది.