Share News

15 కిలోల గంజాయి స్వాధీనం: ఒకరి అరెస్టు

ABN , Publish Date - Jun 01 , 2024 | 01:35 AM

గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 15 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

15 కిలోల గంజాయి స్వాధీనం: ఒకరి అరెస్టు
నిందితుడి వివరాలు తెలియజేస్తున్న సెబ్‌ అధికారులు

గూడూరు, మే 31: గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 15 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఎస్‌ఈబీ కార్యాలయంలో సీఐ రమేష్‌ మీడియాకు వివరాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్‌ జిల్లా బీరోలే గ్రామానికి చెందిన పాపన్న గూడూరు ఆర్టీసీ బస్టాండు సమీపంలో వినాయకగుడి వద్ద బ్యాగును తగిలించుకుని అనుమానాస్పదంగా కనిపించాడు. తనిఖీ చేయగా, అతడి వద్ద 15 కిలోల గంజాయి ఉన్నట్టు గుర్తించారు. వెంటనే పాపన్నను అదుపులోకి తీసుకుని, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో ఎస్‌ఐ మోసెస్‌, కానిస్టేబుళ్లు కిరణ్‌సింగ్‌, ప్రసాద్‌, కృష్ణయ్య, గౌస్‌బాషా, ఆనంద్‌బాబు, రవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 01 , 2024 | 01:35 AM