Share News

సహాయక చర్యల్లో పూతలపట్టు యువకుడు

ABN , Publish Date - Aug 07 , 2024 | 03:15 AM

వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును కర్రల వంతెనపై నుంచి దాటుతున్న ఈ ఆర్మీ ఉద్యోగి పేరు దామోదర్‌. ఈయనది మండల కేంద్రమైన పూతలపట్టు. ఇక్కడి పల్లెవీధిలో నివాసం ఉంటున్న ఈయన ఆర్మీలో చేరారు.

సహాయక చర్యల్లో పూతలపట్టు యువకుడు
హిమాచల్‌ప్రదేశ్‌లో సహాయక చర్యలు చేపడుతున్న పూతలపట్టు యువకుడు

వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును కర్రల వంతెనపై నుంచి దాటుతున్న ఈ ఆర్మీ ఉద్యోగి పేరు దామోదర్‌. ఈయనది మండల కేంద్రమైన పూతలపట్టు. ఇక్కడి పల్లెవీధిలో నివాసం ఉంటున్న ఈయన ఆర్మీలో చేరారు. ఈనెల 2వ తేదీన వరదల ధాటికి కొండచరియలు విరిగిపడి హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని రామ్‌పూర్‌ చమోజ్‌ గ్రామం భూమిలోకి కుంగిపోయిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మృతదేహాలను వెలికితీసేందుకు ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ, ఐటీబీపీ, ఆర్మీ సిబ్బంది, ఆర్మీ మేజర్‌ వాస్నిక్‌ ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ సహాయక చర్యల్లో పూతలపట్టు యువకుడైన ఆర్మీ ఉద్యోగి దామోదర్‌ కూడా చురుగ్గా పాల్గొంటున్నారు.

- పూతలపట్టు

Updated Date - Aug 07 , 2024 | 03:15 AM