31 మండలాల్లో వర్షం
ABN , Publish Date - Jun 08 , 2024 | 01:50 AM
నైరుతి రుతుపవనాల ప్రభావంతో గురువారం ఉదయం 8 నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు 31 మండలాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది.
చిత్తూరు కలెక్టరేట్, జూన్ 7: నైరుతి రుతుపవనాల ప్రభావంతో గురువారం ఉదయం 8 నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు 31 మండలాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. విజయపురం మినహా మిగిలిన 31 మండలాల్లో భారీగా వర్షపాతం నమోదైంది. పాలసముద్రంలో రికార్డుస్థాయిలో 73.4 మి.మీ వర్షం కురిసింది. పలమనేరు 71.2, బైరెడ్డిపల్లి 67.6, గంగవరం 57.8, తవణంపల్లె 57.6, రామకుప్పం 38.2, వి.కోట 36.0, చిత్తూరు అర్బన్ 33.4, కుప్పం 29.0, పూతలపట్టు 28.6, చౌడేపల్లి 28.4, గుడుపల్లె 27.6, గంగాధరనెల్లూరు 27.2, ఐరాల 26.2, శాంతిపురం 26.2, వెదురుకుప్పం 24.2, చిత్తూరు రూరల్ 17.6, పెనుమూరు 16.6, పులిచెర్ల 15.0, బంగారుపాళ్యం 14.6, శ్రీరంగరాజపురం 13.2, యాదమరి 13.0, సోమల 12.6, పుంగనూరు 8.6, పెద్దపంజాణి 7.2, గుడిపాల 6.6, రొంపిచెర్ల 5.2, కార్వేటినగరం 4.2, సదుం 3.2, నగరి 2.6, నిండ్రలో 1.2 మిమీ వర్షపాతం నమోదైంది.