Share News

తెప్పపై రుక్మిణీకృష్ణుల విహారం

ABN , Publish Date - Mar 22 , 2024 | 02:34 AM

తిరుమలలో నిర్వహిస్తున్న శ్రీవారి తెప్పోత్సవాల్లో రెండవరోజైన గురువారం రుక్మిణీకృష్ణులు తెప్పపై భక్తులకు అభయమిచ్చారు.

తెప్పపై రుక్మిణీకృష్ణుల విహారం

తిరుమల, మార్చి21(ఆంధ్రజ్యోతి): తిరుమలలో నిర్వహిస్తున్న శ్రీవారి తెప్పోత్సవాల్లో రెండవరోజైన గురువారం రుక్మిణీకృష్ణులు తెప్పపై భక్తులకు అభయమిచ్చారు. సాయంత్రం 6 గంటలకు రుక్మిణీ సమేత శ్రీకృష్ణుల ఉత్సవమూర్తులను మాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం పుష్కరిణిలో విద్యుద్దీపాలు, పుష్పాలతో శోభాయమానంగా అలంకరించిన తెప్పపై కొలువుదీర్చారు. మంగళవాయిద్యాలు, వేదమంత్రాలు, అన్నమయ్య కీర్తనల ఆలాపనల నడుమ ఉత్సవమూర్తులను తెప్పపై పుష్కరిణిలో మూడుచుట్లు తిప్పారు.శుక్రవారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి తెప్పపై దర్శనమివ్వనున్నారు.

Updated Date - Mar 22 , 2024 | 02:35 AM