Share News

DGP Tirumala Rao : శాంతిభద్రతల బాధ్యతలు శ్రీకాంత్‌కు

ABN , Publish Date - Jun 30 , 2024 | 05:29 AM

రాష్ట్రంలో ఐపీఎ్‌స అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. శాంతిభద్రతల విభాగం నుంచి శంకబ్రత బాగ్చీని విశాఖపట్నం పోలీస్‌ కమిషనర్‌గా నియమించి..

DGP Tirumala Rao : శాంతిభద్రతల బాధ్యతలు శ్రీకాంత్‌కు

  • హోంగార్డ్స్‌ హరికృష్ణకు... ఎఫ్‌ఎస్‌ఎల్‌ రాజశేఖర్‌ బాబుకు

అమరావతి, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో ఐపీఎ్‌స అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. శాంతిభద్రతల విభాగం నుంచి శంకబ్రత బాగ్చీని విశాఖపట్నం పోలీస్‌ కమిషనర్‌గా నియమించి, ఆక్టోపస్‌ ఐజీ శ్రీకాంత్‌కు శాంతిభద్రతల బాధ్యతలను డీజీపీ తిరుమలరావు అప్పగించారు. టెక్నికల్‌ సర్వీసెస్‌ ఐజీ హరికృష్ణకు హోంగార్డ్స్‌, సిబ్బంది బాధ్యతలు అప్పగించారు. పోలీస్‌ రిక్రట్‌మెంట్‌బోర్డు చైర్మన్‌గా ఉన్న రాజశేఖర్‌ బాబుకు ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు కట్టబెట్టారు.

Updated Date - Jun 30 , 2024 | 06:46 AM