‘అన్ని దానాల్లోను అన్నదానం గొప్పది’
ABN , Publish Date - Jan 09 , 2024 | 12:19 AM
జగ్గంపేట, జనవరి 8: అన్ని దానాల్లోను అన్నదానం గొప్పదని, అన్నార్తుల కోసమే అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదల ఆకలి తీరుస్తామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ అన్నారు. గత 11 నెలలుగా ప్రతీ సోమవారం జగ్గంపేట ఎన్టీఆర్ విగ్రహం వద్ద రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, నవీన్ ఆధ్వ
జగ్గంపేట, జనవరి 8: అన్ని దానాల్లోను అన్నదానం గొప్పదని, అన్నార్తుల కోసమే అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదల ఆకలి తీరుస్తామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ అన్నారు. గత 11 నెలలుగా ప్రతీ సోమవారం జగ్గంపేట ఎన్టీఆర్ విగ్రహం వద్ద రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, నవీన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్లో గండేపల్లి మండలం తాళ్ళూరుకు చెందిన దివంగత పైణ్ణి తాతారావు జ్ఞాపకార్ధం వారి కుమారుడు ప్రవీణ్ ఆర్థిక సాయంతో భోజనాలు ఏర్పాటు చేయగా నవీన్ పేదలకు భోజనాలు వడ్డించారు. 2024లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు మళ్లీ అన్న క్యాంటీన్లను కొనసాగిస్తారన్నారు. కార్యక్రమంలో మారిశెట్టి భద్రం కొత్త కొండబాబు, దాపర్తి సీతారామయ్య, సీలామంతుల వీరబాబు, పాలచర్ల సత్యనారాయణ, పైణ్ణి వెంకటేశ్వరరావు, బి.సురేష్, డి.సత్తిబాబు పాల్గొన్నారు.