కారు ఢీకొని వీఆర్ఏ దుర్మరణం
ABN , Publish Date - Jan 11 , 2024 | 01:07 AM
గోకవరం తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏగా విధులు నిర్వర్తిస్తున్న కొల్లాటి ప్రసాద్ (40) బుధవారం రాత్రి కారు ఢీకొనడంతో మరణించారు. రాజానగరంలో నివాసం ఉంటున్న ప్రసాద్ విధి నిర్వహణలో భాగంగా గోకవరం వెళ్లి మోటార్ సైకిల్పై ఇంటికి తిరిగి వస్తున్నాడు.
రాజానగరం, జనవరి 10: గోకవరం తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏగా విధులు నిర్వర్తిస్తున్న కొల్లాటి ప్రసాద్ (40) బుధవారం రాత్రి కారు ఢీకొనడంతో మరణించారు. రాజానగరంలో నివాసం ఉంటున్న ప్రసాద్ విధి నిర్వహణలో భాగంగా గోకవరం వెళ్లి మోటార్ సైకిల్పై ఇంటికి తిరిగి వస్తున్నాడు. మార్గమధ్యంలో రాజానగరం మండలం నందరాడ సమీపానికి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న ఇండికా కారు ప్రసాద్ను బలంగా ఢీకొన్నది. వీఆర్ఏ హెల్మెట్ ధరించినప్పటికీ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు రాజానగరం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.