జాతీయ స్థాయి చెస్ పోటీలకు సాత్విక్ ఎంపిక
ABN , Publish Date - Apr 27 , 2024 | 12:50 AM
భట్లపాలెం బీవీసీ ఇంజనీరింగ్ కళాశాలలో డిప్లొమా ద్వితీయ సంవత్సరం చదువుతున్న ద్రాక్షారపు సాత్విక్ జాతీయ స్థాయి చెస్ పోటీలకు ఎంపికైనట్టు ఫిజికల్ డైరెక్టర్లు కరాటం రవిసుఽధీర్, మురళీకృష్ణ తెలిపారు.
అమలాపురం రూరల్, ఏప్రిల్ 26: భట్లపాలెం బీవీసీ ఇంజనీరింగ్ కళాశాలలో డిప్లొమా ద్వితీయ సంవత్సరం చదువుతున్న ద్రాక్షారపు సాత్విక్ జాతీయ స్థాయి చెస్ పోటీలకు ఎంపికైనట్టు ఫిజికల్ డైరెక్టర్లు కరాటం రవిసుఽధీర్, మురళీకృష్ణ తెలిపారు. విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి చెస్ పోటీల్లో ప్రతిభ కనబరిచి జూలై 15 నుంచి 23వరకు ఛత్తీస్గఢ్లో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్టు తెలిపారు. శుక్రవారం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో బీవీసీ విద్యా సంస్థల అధినేత బోనం కనకయ్య, చైర్మన్ బోనం కృష్ణసతీష్, ప్రిన్సిపల్ డాక్టర్ జేవీజీ రామారావు, డిప్లొమా ప్రిన్సిపాల్ ఫణిశంకర్, పరిపాలనాధికారి జక్కం వెంకటకృష్ణారావు ప్రత్యేకంగా అభినందించారు.