దేశానికి జవాన్, కిసాన్ పాలనకావాలి
ABN , Publish Date - Mar 11 , 2024 | 12:31 AM
దేశం కోసం ప్రాణాలర్పించే జవాన్, ప్రజలకు తిండిపెట్టే కిసాన్ల పాలన కావాలని భారతీయ జవాన్ కిసాన్ పార్టీ నేషనల్ కోఆర్డినేటర్ సుదరి మోహనరావు అన్నారు. రాజమండ్రి ప్రెస్క్లబ్లో ఆదివారం ఆయన మాట్లాడారు.
రాజమహేంద్రవరం సిటీ, మార్చి 10: దేశం కోసం ప్రాణాలర్పించే జవాన్, ప్రజలకు తిండిపెట్టే కిసాన్ల పాలన కావాలని భారతీయ జవాన్ కిసాన్ పార్టీ నేషనల్ కోఆర్డినేటర్ సుదరి మోహనరావు అన్నారు. రాజమండ్రి ప్రెస్క్లబ్లో ఆదివారం ఆయన మాట్లాడారు. శక్తివంతమైన పాలన జవాన్ కిసాన్ల వల్లనే సాధమవుతుందన్నారు. విద్య, వైద్యం, సమాంతర న్యాయం మూడు అంశాలనే తమ ఎన్నికల మెనిఫెస్టోలో ప్రధాన అంశాలుగా చేర్చి ఎన్నికలకు సిద్ధమవుతున్నామన్నారు. దేశంలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో తాము పోటీ చేయడంలేదని అన్ని పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు. ప్రజాస్వామ్యంలో మాజీ సైనిక ఉద్యోగులంతా పాలుపంచుకోవాలని ఈ పార్టీని స్థాపించామన్నారు. రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా బంగారు కృష్ణమూర్తిని పోటీకి నిలబెడుతున్నామన్నారు. సమావేశంలో పార్టీ న్యాయసలహాదారులు అబ్దుల్ సలామ్, రాష్ట్ర కార్యదర్శి శివప్రసాద్ కుమార్, టి.రామ్కుమార్(ప్రొద్దుటూరు), నెల్లూరి సుషిత (కడప), రమణస్వామి, రాజేశ్వరరావు, తెలంగాణ నాయకుడు యోగేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.