Share News

కాకినాడ డిపోలో ‘డయల్‌ యువర్‌ డీఎం’

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:01 AM

కార్పొరేషన్‌ (కాకినాడ), మార్చి 28: కాకినాడ డిపోలో గురువారం డయల్‌ యువర్‌ డీఎం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డిపో మేనేజర్‌ ఎంవీ మనోహర్‌తో పలువురు మాట్లాడారు. పెద్దాపురం దర్గాసెంటర్‌, సామర్లకోట బల్ల మార్కెట్‌, విఘ్నేశ్వర టాకీస్‌, మెహర్‌ కాంప్లెక్స్‌ బ్రౌన్‌పేట వద్ద టైమింగ్స్‌ బోర్డులు ఏర్పాటు

కాకినాడ డిపోలో ‘డయల్‌ యువర్‌ డీఎం’

కార్పొరేషన్‌ (కాకినాడ), మార్చి 28: కాకినాడ డిపోలో గురువారం డయల్‌ యువర్‌ డీఎం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డిపో మేనేజర్‌ ఎంవీ మనోహర్‌తో పలువురు మాట్లాడారు. పెద్దాపురం దర్గాసెంటర్‌, సామర్లకోట బల్ల మార్కెట్‌, విఘ్నేశ్వర టాకీస్‌, మెహర్‌ కాంప్లెక్స్‌ బ్రౌన్‌పేట వద్ద టైమింగ్స్‌ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. సామర్లకోట-పిఠాపురం బస్సును పెద్దాపురం వరకు పొడిగించాలని కోరారు. తుని, కాకినాడ బస్సులు ఒకేసారి వరుసగా కలిసిపోతున్నాయని సరిగ్గా ఆపడంలేదని డీఎంకు తెలిపారు. కాకినాడ-జి.మామిడాడ మధ్య బడి బస్సును తిప్పాలని, పిఠాపురం- ఏలేశ్వరం మధ్య బస్సులను పునరుద్ధరించాలని పలువురు కోరారు. వీటిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని డీఎం తెలిపారు.

Updated Date - Mar 29 , 2024 | 12:01 AM