9న ప్రత్తిపాడులో చంద్రబాబు బహిరంగ సభ
ABN , Publish Date - Mar 04 , 2024 | 12:07 AM
జగ్గంపేట రూరల్, మార్చి 3: ప్రత్తిపాడులో ఈనెల 9న టీడీపీ అధినేత చంద్రబాబు నాయు డు బహిరంగ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జగ్గంపేట మండలం ఇర్రి పాక శివాలయం వద్ద నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశానికి నె
టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ
జగ్గంపేట రూరల్, మార్చి 3: ప్రత్తిపాడులో ఈనెల 9న టీడీపీ అధినేత చంద్రబాబు నాయు డు బహిరంగ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జగ్గంపేట మండలం ఇర్రి పాక శివాలయం వద్ద నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశానికి నెహ్రూ, జిల్లా టీడీ పీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ముఖ్య అతిథు లుగా హాజరయ్యారు. నెహ్రూ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి, గోకవరం, మండలాల నుంచి 20వేల మంది టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళలు తరలిరావాలన్నారు. 9న మధ్యాహ్నం 2 గంటలకు సోమవరం గ్రామంలో వేంకటేశ్వర స్వామి ఆలయం వద్దకు చేరుకోవాలని అక్కడ నుంచి బయల్దేరి ప్రత్తిపాడు బహిరంగ సభకు వెళ్లాలన్నారు. ఈనెల12న 12మంది క్లస్టర్లలోని 12 సభలు ఏర్పాటు చేస్తామని, ముందుగా 12న నరేంద్రపట్నంలోని సభ ఉంటుందని నెహ్రూ తెలిపారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, జనసేన నాయకులు పాల్గొన్నారు.
టీడీపీలో చేరిక
గోకవరం గ్రామానికి చెందిన వైసీపీకి చెం దిన దాసరి తరుణ్ ఆధ్వర్యంలో పలువురు జ్యోతుల నెహ్రూ సమక్షంలో టీడీపీలో చేరారు. కార్యక్రమంలో దాసరి తమ్ముడు దొర, దాసరి తరుణ్, ఎస్వీ అప్పలరాజు, కొత్త కొండబాబు, అడపా తాతాజీ, నకిరెడ్డి రాంబాబు పాల్గొన్నారు.