Share News

గ్రామాలకు ముందుగానే సంక్రాంతి పండుగ

ABN , Publish Date - Oct 18 , 2024 | 11:39 PM

పిఠాపురం రూరల్‌, అక్టోబరు 18 (ఆంధ్ర జ్యోతి): గ్రామాలకు ముందుగానే సంక్రాంతి పండుగ వచ్చిందని జనసేన పిఠాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు తెలిపారు. పిఠాపురం మండలం కుమారపురం, ఎఫ్‌కేపా లెం, కందరాడ, జల్లూరు, మల్లాం, విరవ, విరవాడ, మంగితుర్తి గ్రామాల్లో పల్లె పండుగ కార్య

గ్రామాలకు ముందుగానే సంక్రాంతి పండుగ
కుమారపురంలో శంకుస్థాపన చేస్తున్న మర్రెడ్డి

పిఠాపురం రూరల్‌, అక్టోబరు 18 (ఆంధ్ర జ్యోతి): గ్రామాలకు ముందుగానే సంక్రాంతి పండుగ వచ్చిందని జనసేన పిఠాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు తెలిపారు. పిఠాపురం మండలం కుమారపురం, ఎఫ్‌కేపా లెం, కందరాడ, జల్లూరు, మల్లాం, విరవ, విరవాడ, మంగితుర్తి గ్రామాల్లో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా బీజేపీ నియోజకవర్గ కన్వీనర్‌ డాక్టర్‌ బుర్రా కృష్ణంరాజు, టీడీపీ నేతలతో కలిసి సీసీరోడ్లు నిర్మాణానికి శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ పాలనలో గ్రామపంచాయతీలు నిర్వీర్యమయ్యాయన్నారు. డిప్యూటీ సీఎంగా పవన్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత గ్రామా ల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు, జనసేన నాయకుడు పిల్లా శివశంకర్‌ తదితరులున్నారు.

Updated Date - Oct 18 , 2024 | 11:39 PM