దుర్మార్గుడి చేతిలో కాకినాడ : వనమాడి
ABN , Publish Date - Jan 06 , 2024 | 12:13 AM
కాకినాడ సిటీ, జనవరి 5: రాష్ట్రంలో అత్యంత అవినీతిపరుడు, దుర్మార్గుడి చేతిలో కాకినాడ నగరం ఉందని... ఎమ్మెల్యే ద్వారంపూడి చేస్తున్న అవినీతి, దౌర్జన్యం, దోపిడీల తో కాకినాడ అభివృద్ధి కుంటుపడిందని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపి ంచారు. కాకినాడలో టీడీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చేశాం కాబట్టి ప్రజల్లో ఽఽధైర్యంగా తిరుగుతున్నామ
కాకినాడ సిటీ, జనవరి 5: రాష్ట్రంలో అత్యంత అవినీతిపరుడు, దుర్మార్గుడి చేతిలో కాకినాడ నగరం ఉందని... ఎమ్మెల్యే ద్వారంపూడి చేస్తున్న అవినీతి, దౌర్జన్యం, దోపిడీల తో కాకినాడ అభివృద్ధి కుంటుపడిందని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపి ంచారు. కాకినాడలో టీడీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చేశాం కాబట్టి ప్రజల్లో ఽఽధైర్యంగా తిరుగుతున్నామని చెబుతున్న ద్వారంపూడి అభివృద్ధి చేసి ఉంటే బారికేడ్లు, పరదాల మధ్య జగన్రెడ్డి ఎందుకు తిరుగుతున్నాడో చెప్పాలన్నారు. టీడీఆర్ బాండ్ల పేరుతో రూ.219కోట్లు ద్వారంపూడి కొట్టేశాడని, దీని వల్ల సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్ అయ్యారన్నా రు. కాకినాడ నగరానికి బ్రాందీ షాపు, స్పా సెంటర్లు లాంటి రెండు పెద్ద ప్రాజెక్టులు తీసుకువచ్చి ప్రారంభించారన్నారు. తనపై పోటీకి భయపడుతున్న ద్వారంపూడికి పవ న్కల్యాణ్ వరకు ఎందుకని కొండబాబు అన్నారు. సమావేశంలో టీడీపీ నగర అధ్యక్షు డు మల్లిపూడి వీరు, గదుల సాయిబాబు, పలివెల రవి, తుమ్మల రమేష్, కొల్లాబత్తుల అప్పారావు, వొమ్మి బాలాజీ, సీకోటి అప్పలకొండ, గుజ్జు లక్ష్మణరావు పాల్గొన్నారు.