మద్యం కేసులు స్వాధీనం
ABN , Publish Date - May 11 , 2024 | 12:58 AM
పిఠాపురం మండలం బి.ప్రత్తిపాడు గ్రామంలో ఫ్లయింగ్స్క్వాడ్ అధికారులు, పోలీసులు శుక్రవారం సాయంత్రం దాడులు నిర్వహించారు. గ్రామంలోని వనుం సత్యనారాయణ ఇంటిలో ఉంచిన 77 కేసుల మద్యం బాటిళ్లను (3,234 మద్యం సీసాలు) స్వాధీనం చేసుకున్నారు.
పిఠాపురం రూరల్, మే 10: పిఠాపురం మండలం బి.ప్రత్తిపాడు గ్రామంలో ఫ్లయింగ్స్క్వాడ్ అధికారులు, పోలీసులు శుక్రవారం సాయంత్రం దాడులు నిర్వహించారు. గ్రామంలోని వనుం సత్యనారాయణ ఇంటిలో ఉంచిన 77 కేసుల మద్యం బాటిళ్లను (3,234 మద్యం సీసాలు) స్వాధీనం చేసుకున్నారు. వీటిని స్వాధీనం చేసుకోవడంలో పోలీసులు, అధికారులు తీవ్ర జాప్యం చేయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు, ఇది వైసీపీ నేతలకు చెందిన మద్యం కావడంతో అధికారులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎట్టకేలకు పోలీసులు సదరు తాళాలు తొలగించి మద్యం సీసాలను సీజ్ చేశారు. వీటిని వైసీపీ నాయకులు నిల్వ చేసినట్లు చెబుతున్నారు. అంగన్వాడీ కేంద్రం సమీపంలో వీటిని ఉంచినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.