పవన్ విజయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు
ABN , Publish Date - Apr 13 , 2024 | 01:16 AM
పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్కల్యాణ్ గెలుపుని ఎన్ని కుతంత్రాలు చేసినా ఎవ్వరూ అడ్డుకోలేరని ఆ పార్టీ స్టార్ క్యాంపయినర్, సినీ నటుడు హైపర్ ఆది తెలిపారు.
పిఠాపురంలో హైపర్ ఆది ప్రచారం
పిఠాపురం/కొత్తపల్లి, ఏప్రిల్ 12: పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్కల్యాణ్ గెలుపుని ఎన్ని కుతంత్రాలు చేసినా ఎవ్వరూ అడ్డుకోలేరని ఆ పార్టీ స్టార్ క్యాంపయినర్, సినీ నటుడు హైపర్ ఆది తెలిపారు. పిఠాపురం పట్టణంలోని 2,3వ వార్డుల్లో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులతో కలిసి ఆయన శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గాజుగ్లాసు గుర్తుపై ఓటు వేసి పవన్ను గెలిపించాలని అభ్యర్ధించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పవన్ లక్ష మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని చెప్పారు. పవన్కల్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి సిద్ధాంతాలు నచ్చి ఆయనతో కలిసి అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. ఏ అధికారం లేకుండానే కౌలు రైతులు సహా ఎందరినో ఆదుకుంటున్నారని చెప్పారు. పవన్ను దత్తపుత్రుడు అంటూ కొందరు ఎగతాళి చేశారని, దత్తాత్రేయుడు ఆయన దత్తపుత్రుడిగా చేసుకుని పిఠాపురం నుంచి పోటీ చేయిస్తున్నారని తెలిపారు. అంతకు ముందు కోటగుమ్మం సెంటర్ వద్ద ఉన్న జైగణేష్ దేవస్థానం, అగ్రహారంలోని అనఘా దత్త క్షేత్రాల్లో పూజలు నిర్వహించారు. ప్రచారంలో జనసేన పార్టీ జాతీయ మీడియా ప్రతినిధి వేములపాటి అజయకుమార్, రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తనయుడు గిరీష్వర్మ, వీరమహిళల విభాగం ఉభయగోదావరి జిల్లాల కోఆర్డినేటర్ చల్లా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అలాగే హైపర్ ఆది కొత్తపల్లి మండలం వాకతిప్ప, కొత్తపల్లి, కొండెవరం గ్రామాల్లో స్థానిక నాయకులతో కలసి ప్రచారం నిర్వహించారు. జనసేన, టీడీపీ నాయకులు గవర రాంబాబు, మత్సా అప్పాజీ, గుండ్ర జగ్గారావు, గుండా అప్పారావు, పలువురు చేనేత కార్మికులు పాల్గొన్నారు.