Share News

నిరుద్యోగ యువతకు ఉచిత డీఎస్సీ కోచింగ్‌

ABN , Publish Date - Oct 17 , 2024 | 12:34 AM

పిఠాపురం, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): నిరు ద్యోగ యువతీ యువకుల కోసం వర్మాస్‌ కావ్య ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్‌ ఇవ్వనున్నట్టు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ తెలిపారు. పిఠాపురం టీడీపీ కార్యాలయంలో బుధవారం సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. ఎన్నికల ముందు నిరుద్యోగ యువతకు ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే కూటమి ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వనున్నద

నిరుద్యోగ యువతకు ఉచిత డీఎస్సీ కోచింగ్‌
పిఠాపురంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే వర్మ

పిఠాపురం, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): నిరు ద్యోగ యువతీ యువకుల కోసం వర్మాస్‌ కావ్య ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్‌ ఇవ్వనున్నట్టు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ తెలిపారు. పిఠాపురం టీడీపీ కార్యాలయంలో బుధవారం సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. ఎన్నికల ముందు నిరుద్యోగ యువతకు ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే కూటమి ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వనున్నదని చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పిఠాపురం నియోజకవర్గంలో డీఎస్సీకి హాజరయ్యే ఎస్‌జీటీ అభ్యర్థుల కోసం తమ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో బ్రహ్మాస్‌ కోచింగ్‌ సెంటర్‌ ద్వారా ఉచిత శిక్షణ ఇస్తామని తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని ఎస్జీటీ పోస్టులకు హాజరయ్యే డీఎస్సీ అభ్యర్థులు తమ వివరాలను పిఠాపురంలో అంజనా జూనియర్‌ కళాశాల చెంతన ఉన్న టీడీపీ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. ఇతర వివరాలు కోసం సెల్‌ 8978869999లో సంప్రదించాలని సూచించారు. టీడీపీ నాయకులున్నారు.

Updated Date - Oct 17 , 2024 | 12:34 AM