జాబ్మేళాను సద్వినియోగం పరుచుకోవాలి
ABN , Publish Date - Aug 20 , 2024 | 01:00 AM
రావులపాలెం సత్యసాయి కళాశాల క్రీడా ప్రాంగణంలో ఈనెల21న నిర్వహించబోయే జాబ్మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ యువ నాయకులు బండారు సంజీవ్ అన్నారు.
రావులపాలెం, ఆగస్టు 19: రావులపాలెం సత్యసాయి కళాశాల క్రీడా ప్రాంగణంలో ఈనెల21న నిర్వహించబోయే జాబ్మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ యువ నాయకులు బండారు సంజీవ్ అన్నారు. టీడీపీ తెలుగురైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, మండల శాఖ అధ్యక్షుడు గుత్తుల పట్టాభిరామారావు, ఇతర నాయకులతో కలిసి సోమవారం సంజీవ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో వికాస నిర్వహించే జాబ్మేళాకు హెచ్పీఎల్, టెక్ మహేంద్ర, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయన్నారు. 2025 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, బి.టెక్, పీజీ చదివిన నిరుద్యోగులు జాబ్మేళాలో పాల్గొనవచ్చనన్నారు. ముందుగా రిజిస్ర్టేషన్ కోసం 7799376111 నెంబరు సంప్రదించాలని సూచించారు.