Amaravati: రహదారులకు మోక్షం.. మరమ్మతులకు రూ.476 కోట్లు విడుదల
ABN , Publish Date - Sep 13 , 2024 | 08:54 PM
రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వర్షాలు.. రహదారులను నామరూపాల్లేకుండా తుడిచిపెట్టేశాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి.
అమరావతి: రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వర్షాలు.. రహదారులను నామరూపాల్లేకుండా తుడిచిపెట్టేశాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. ఇవాళ రోడ్లు, భవనాల శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దెబ్బతిన్న రహదారుల మరమ్మతుల కోసం భారీ మొత్తంలో నిధులు విడుదల చేసింది. ప్రధాన రహదారుల మరమ్మతులకుగానూ రూ.186కోట్లు విడుదలయ్యాయి.
గుంతలు పూడ్చే పనులకు ప్రభుత్వం మరో రూ. 290 కోట్లు విడుదల చేసింది. వర్షాలు తగ్గిన వెంటనే పనులు ప్రారంభించాలని సీఎం అధికారులకు ఆదేశించారు. వెంటనే టెండర్ ప్రక్రియను చేపట్టాలని సూచించారు. ఆర్వోబీల పూర్తికి భూసేకరణకు కూడా నిధులు విడుదలయ్యాయి. రూ.65 వేల కోట్లతో జరుగుతున్న నేషనల్ హైవే పనులను సకాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
For Latest News and National News click here