Share News

AP News: పాన్యం నియోజక వర్గాన్ని ఎమ్మెల్యే, ఆయన వర్గీయులు లూటీ చేశారన్న చరితా రెడ్డి

ABN , Publish Date - Feb 22 , 2024 | 01:21 PM

దమ్ము, దైర్యం ఉంటే పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తప్పు చేయలేదని నిరూపించుకోవాలని మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే నాలుగు సార్లు అవినీతి, అక్రమాలు నిరుపిస్తామని కాటసానికి సవాల్ చేశానన్నారు.

AP News: పాన్యం నియోజక వర్గాన్ని ఎమ్మెల్యే, ఆయన వర్గీయులు లూటీ చేశారన్న చరితా రెడ్డి

కర్నూలు: దమ్ము, దైర్యం ఉంటే పాణ్యం వైసీపీ (YCP) ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి (Katasani Ram Bhupal Reddy) తప్పు చేయలేదని నిరూపించుకోవాలని మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి (Gowru Charitha Reddy) పేర్కొన్నారు. ఇప్పటికే నాలుగు సార్లు అవినీతి, అక్రమాలు నిరుపిస్తామని కాటసానికి సవాల్ చేశానన్నారు. అయినా కూడా ఆయన డిబేట్‌కు రాలేదన్నారు.

పాన్యం నియోజక వర్గాన్ని ఎమ్మెల్యే ఆయన వర్గీయులు కలిసి లూటీ చేశారన్నారు. భూ కబ్జాలు దౌర్జన్యాలు దోపిడీ చేసింది కాక.. కాటసాని మళ్లీ ఈనాడు మీద దాడి చేయించారన్నారు. పచ్చటి పంట పొలాలు, వ్యవసాయ భూములు కబ్జా చేస్తున్నారన్నారు. కాటసాని అరాచకాలు.. భూ కబ్జాలను ప్రజలంతా గమనిస్తున్నారని గౌరు చరితారెడ్డి అన్నారు.

Updated Date - Feb 22 , 2024 | 01:21 PM