Share News

ఘనంగా గణనాధుల ఊరేగింపు

ABN , Publish Date - Sep 15 , 2024 | 11:54 PM

మండల వ్యాప్తంగా తొమ్మిదిరోజుల పాటు పూజలందుకున్న గణనాధున్ని ఆదివారం వివిధ గ్రామాల్లో ఊరేగించారు.

ఘనంగా గణనాధుల ఊరేగింపు

చెన్నూరు, సెప్టెంబరు 15 : మండల వ్యాప్తంగా తొమ్మిదిరోజుల పాటు పూజలందుకున్న గణనాధున్ని ఆదివారం వివిధ గ్రామాల్లో ఊరేగించారు. కొండపేట, ముండ్లపల్లె, గుర్రంపాడు తదితర గ్రా మాల్లో వీధివీధినా ఊరేగింపు చేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో లడ్డు వేలం పాట పోటాపోటీగా నిర్వహించారు. అలాగే ఊరేగించిన గణనాధులను సమీప పెన్నానదిలో నిమజ్జనం చేశా రు. ఈసందర్భంగా సీఐ పురుషోత్తంరాజు మాట్లాడుతూ అన్ని విఘ్నాలను తొలగించే గణేశున్ని నిత్యం పూజించడం, స్మరించడం ఎంతో ఉత్తమమని అలాంటిమూర్తికి తొమ్మిదిరోజులపాటు పూజించడం సంతోషమన్నారు. ఈ సందర్భంగా ముండ్లపల్లెలో సీఐని ఉత్సవ కమిటి నిర్వాహకులు సత్కరించారు.

Updated Date - Sep 15 , 2024 | 11:54 PM