Home » KADAPA
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచ ఆహార పథకంతో ఒప్పందం కుదుర్చుకున్నది. ముందుగా కడప జిల్లాలో చిన్న, సన్నకారు రైతుల కోసం వాతావరణ అనుకూలత కల్పించే ప్రాజెక్టును అమలు చేయనున్నారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృత్యువాత పడ్డారు. రాపూరు తిక్కనవాటిక పార్క్ సమీపంలో ఓ ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న సురేశ్, అతని అత్త సరస్వతి అక్కడికక్కడే మరణించారు.
అన్నమయ్యజిల్లాలో విషాదం నెలకొంది. మైలపల్లెరాచపల్లెకు చెందిన ఏడేళ్ల వయసుగల ముగ్గురు బాలురు ఈతకు వెళ్లి నీటికుంటలో మునిగి చనిపోయారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి కళ్యాణోత్సవం ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా ఒంటిమిట్ట చేరుకుని ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి స్వామి వారి ప్రసాదం స్వీకరించారు.
సీతారాముల కల్యాణానికి కడప జిల్లా ఒంటిమిట్ట సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. శుక్రవారం జరుగనున్న కల్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ ఆధ్వర్యంలో కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసింది. వేదిక ముందుభాగంలో వీవీఐపీ గ్యాలరీతో పాటు క్యూలైన్లు, ఆలయం వద్ద భారీగా చలువ పందిళ్లు సిద్ధం చేశారు. కల్యాణోత్సవానికి సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు.
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు రెండు రోజుల షెడ్యూల్ బిజీ బిజీగా ఉండనుంది. ఏలూరు, కడప రెండు జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. ఈ రెండు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొంటారు.
మంత్రి సవిత ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం మంగళవారం పులివెందులలో జరిగింది. ఈ క్రమంలో టీడీపీ నాయకుల మధ్య వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, బీటెక్ రవి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ క్రమంలో సమావేశంలో ఇరువర్గాలకు చెందినవారు బాహా బాహీకి దిగారు.
విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరామనవమి సందర్భంగా భక్తుల మధ్య సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. మంత్రులతో పాటు ప్రముఖులు హాజరై స్వామివారి కల్యాణాన్ని తిలకించారు
వైసీపీ నేత అంజద్బాషా సోదరుడు అహ్మద్ బాషాను కడప తాలూకా పోలీసులు ముంబైలో అరెస్టు చేశారు. వివిధ క్రిమినల్ కేసుల నేపథ్యంలో ఆయనపై లుక్అవుట్ నోటీసులు జారీ అయ్యాయి
Ahmed Basha Arrested: మాజీమంత్రి, వైసీపీ నేత అంజాద్ భాష తమ్ముడు అహ్మద్ భాషను కడప పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలో ఆయన ఉన్నట్లు సమాచారం తెలుసుకుని అక్కడకు వెళ్లిన పోలీసులు అహ్మద్ భాషను అదుపులోకి తీసుకున్నారు.