మద్యం దుకాణాలు తనిఖీ
ABN , Publish Date - Apr 23 , 2024 | 11:51 PM
జిల్లా ఫ్లయింగ్ స్క్కాడ్ సిబ్బంది మంగళవారం పీలేరులోని మద్యం దుకాణాలను ఆకస్మి కంగా తనిఖీ చేసింది.
పీలేరు, ఏప్రిల్ 23: జిల్లా ఫ్లయింగ్ స్క్కాడ్ సిబ్బంది మంగళవారం పీలేరులోని మద్యం దుకాణాలను ఆకస్మి కంగా తనిఖీ చేసింది. ఫ్లయింగ్ స్క్వాడ్ జిల్లా నోడల్ అధికారి, జిల్లా వ్యవసాయ శాఖాధికారి చంద్రా నాయక్ నేతృత్వంలో జరిగిన తనిఖీలలో మద్యం దుకాణాల్లోని పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా చం ద్రా నాయక్ సిబ్బందితో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్ని కల సందర్భంగా జాగ్రత్తగా మెలగాలని, మద్యం అమ్మ కాలపై ఎటువంటి ఆరోపణలు రాకుండా చూసుకోవా లన్నారు. మద్యం అమ్మకాలను నియంత్రించాలన్న లక్ష్యంతో ప్రభుత్వ మద్యం డిపోతోపాటు జిల్లాలోని దుకాణాలను తనిఖీ చేస్తున్నామన్నారు. దుకాణాల సూపర్వైజర్లు మద్యం స్టాకును ఎప్పటికప్పుడు సరిచూ సుకుంటే ఎటువంటి అవకతవకలు జరగవన్నారు. ఈ తనిఖీలలో డీటీ జయసింహ, ఎక్సైజ్ ఎస్ఐ రామకృష్ణ శాసి్త్ర, పోలీస్ ఎస్ఐ గాయత్రి, జీఎస్టీ అధికారి హేమంత, తదితరులు పాల్గొన్నారు.