Share News

సీఎం చంద్రబాబుతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి

ABN , Publish Date - Sep 27 , 2024 | 12:09 AM

సీఎం చంద్రబాబుతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణచైతన్యరెడ్డి అన్నారు.

సీఎం చంద్రబాబుతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి
ఇది మంచి ప్రభుత్వం సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే క్రిష్ణచైతన్యరెడ్డి

ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే

సీకేదిన్నె, సెప్టెంబరు 26: సీఎం చంద్రబాబుతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణచైతన్యరెడ్డి అన్నారు. గురువారం చింతకొమ్మదిన్నె మండలం కొలుములపల్లె గ్రామ సచివాలయం వద్ద ‘ఇది మంచి ప్రభుత్వం’ గ్రామ సభ నిర్వహించి పోస్టర్లను ఆవిష్కరించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది చాలా మంచి ప్రభుత్వం ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో ఉన్నప్పటికి సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లలా భావించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చర్యలు తీసుకుంటున్నారన్నారు. కొప్పర్తి పారిశ్రామిక వాడలో అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రూ.2,150 వేల కోట్లు మంజూరు చేయించారన్నారు. అలాగే స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమంలో ప్రజల అవసరాలను గుర్తించి ప్రణాళికలు రూపొందించుకుని అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. టీడీపీ మండల ఇన్‌చార్జి క్రిష్ణారెడ్డి, మోహన్‌బాబు, వెంకటసుబ్బయ్య, డీవీ, మహేంద్ర, సుబ్బారెడ్డి, రాజా, జనసేన నాయకులు వేణుగోపాల్‌రెడ్డి, రెడ్డిప్రసాద్‌, మండల స్పెషల్‌ ఆఫీసర్‌ చాంద్‌బాష, తహసీల్దారు రాజేశ్వరరావు, ఎంపీడీఓ శ్రీధర్‌, ఎంఈవోలు వెంకటరామిరెడ్డి, రమాదేవి, వివిధ అధికారులు, నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Sep 27 , 2024 | 12:09 AM