టీడీపీ నేతలతో గంటా నరహరి చర్చలు
ABN , Publish Date - Jan 27 , 2024 | 12:10 AM
రాజం పేట టీడీపీ నేత గంటా నరహరి కడప జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి బాలిశెట్టి హరిప్రసాద్, మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య కుమారుడు పసుపు లేటి పవన్ కుమార్తో మంతనాలు జరిపారు.
రాజంపేట, జవరి 26: రాజం పేట టీడీపీ నేత గంటా నరహరి కడప జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి బాలిశెట్టి హరిప్రసాద్, మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య కుమారుడు పసుపు లేటి పవన్ కుమార్తో మంతనాలు జరిపారు. రాజంపేటలోని ఆయన కార్యాలయంలో రా.. కదలిరా సభకు జనసమీకరణపై చర్చించారు. కడపకు వెళ్లి టీడీపీ పొలిట్బ్యూరో స భ్యుడు ఆర్.శ్రీనివాసరెడ్డితో ఏకాంతంగా భేటీ అయ్యారు. మండల టీడీపీ అధ్యక్షుడు గన్నె నరసయ్యనాయుడు, మండల ప్రదాన కార్యదర్శి బొబ్బిలి రాయుడు, సిద్దవటం నాయకులు నాగమునిరెడ్డి, తెలుగు యువత నాయకులు పిడికిటి సంతోష్నాయుడు, ఆర్యవైశ్య సంఘ నాయకులు సునీల్, మైనారిటీ నాయకులు మస్తాన్ పాల్గొన్నారు.