Share News

పేదల సంక్షేమాన్ని విస్మరించారు

ABN , Publish Date - Apr 23 , 2024 | 10:55 PM

ముఖ్యమంత్రి జగనమోహనరెడ్డి పేదల సంక్షేమాన్ని విస్మరించారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్‌బాబు తెలిపారు. మంగళవారం మండలంలోని తిమ్మసముద్రం గ్రామ పంచాయతీలో కూటమి ఎన్నికల ప్రచారాన్ని ఆయన ప్రారంభిం చారు.

పేదల సంక్షేమాన్ని విస్మరించారు
తిమ్మసముద్రంలో ఇంటింటి ప్రచారం చేస్తున్న సుగవాసి ప్రసాద్‌బాబు

టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి ప్రసాద్‌బాబు

సుండుపల్లె, ఏప్రిల్‌ 23: ముఖ్యమంత్రి జగనమోహనరెడ్డి పేదల సంక్షేమాన్ని విస్మరించారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్‌బాబు తెలిపారు. మంగళవారం మండలంలోని తిమ్మసముద్రం గ్రామ పంచాయతీలో కూటమి ఎన్నికల ప్రచారాన్ని ఆయన ప్రారంభిం చారు. రాజంపేట పార్లమెంట్‌ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి సుగవాసి బాల సుబ్రమణ్యంను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ ఐదేళ్లలో గ్రామ పంచాయతీల్లో ఏ ఒక్క అభివృద్ధి పనికి శిలాఫలకం వెయ్యలేదని ఓటర్లకు తెలియజేశారు. మంచి చేసి ఉంటే ఓటు వేయమని వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు సిగ్గులేకుండా మరోమారు ప్రజలను మోసం చేసేందుకు వస్తు న్నారని విమర్శించారు. ఈ సందర్భంగా తిమ్మసముద్రం గ్రామ పంచాయ తీలో పలువురు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు రెడ్డెప్ప, క్లస్టర్‌ ఇనచార్జి శివకుమార్‌నాయుడు, ప్రధన కార్యదర్శి ప్రసాద్‌రాజు, చప్పిడి రమేశనాయుడు, రామనాధరెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు మోహనబాబునాయుడు, దామోదర్‌నాయుడు, వెంకటేశ్వర్‌నాయుడు, సత్యంనాయుడు, జయరాంనాయుడు, సుబ్బారెడ్డి, యూనిట్‌ ఇనచార్జి శ్రీనివాసులునాయుడు, శివరాంనాయుడు, మండల మాజీ అధ్యక్షుడు తిరుమలరెడ్డి శివారెడ్డి, జనసేన మండల నేత రెడ్డిరాణి, రామాశ్రీనివాసులు, బీజేపీ జిల్లా నాయకులు వెంకటరామరాజు తదితరులు పాల్గొన్నారు.

సుగవాసికి మూడు గ్రామాల ప్రజల మద్దతు

నందలూరు: మండలంలోని కోనాపురం, చింతకాయలపల్లె, కొమ్మూరు గ్రామ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు మంగళవారం పెద్ద సంఖ్యలో బీజేపీ అభ్యర్ధి సుగవాసి బాలసుబ్రమణ్యంను కలిసి తమ సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Apr 23 , 2024 | 10:55 PM