Share News

నర్సాపురం పోస్టాఫీసులో అధికారుల విచారణ

ABN , Publish Date - Aug 28 , 2024 | 12:12 AM

నర్సాపురం పోస్టాఫీసు రెండు మూడు రోజులుగా మూతబడింది. ఇక్కడ పనిచేస్తున్న బీపీఎం నాయక్‌ విధులకు గైర్హాజరవుతున్నట్లు పైఅధికారుల దృష్టికి వెళ్ళడంతో మంగళవారం బద్వేల్‌ పోస్టల్‌ సబ్‌డివిజన్‌ హెడ్‌ ఎన్‌.సుబ్బరాయుడు పోస్ట్ట్‌ఆఫీసును తనిఖీ చేశారు. సిబ్బంది కార్యాలయం తెరవక పోవడంతో గ్రామస్థుల సమక్షంలో కార్యాలయం తాళాలు పగులగొట్టారు.

నర్సాపురం పోస్టాఫీసులో అధికారుల విచారణ

కాశినాయన ఆగస్టు27: నర్సాపురం పోస్టాఫీసు రెండు మూడు రోజులుగా మూతబడింది. ఇక్కడ పనిచేస్తున్న బీపీఎం నాయక్‌ విధులకు గైర్హాజరవుతున్నట్లు పైఅధికారుల దృష్టికి వెళ్ళడంతో మంగళవారం బద్వేల్‌ పోస్టల్‌ సబ్‌డివిజన్‌ హెడ్‌ ఎన్‌.సుబ్బరాయుడు పోస్ట్ట్‌ఆఫీసును తనిఖీ చేశారు. సిబ్బంది కార్యాలయం తెరవక పోవడంతో గ్రామస్థుల సమక్షంలో కార్యాలయం తాళాలు పగులగొట్టారు. అనంతరం లోపలి బీరువాబీగాలు పగలగొట్టి రికార్డులు బయటికి తీశారు. అధికారులు పొదుపు ఖాతాదారుల ఆన్‌లైన్‌ వివరాలు తెప్పించుకొని విచారణ ప్రారంభించారు. పలువురు ఖాతాదారులు జమచేసిన డబ్బులు, మ్యాన్‌వల్‌ పుస్తకాలకు, ఆన్‌లైన్‌లో నమోదైన వివరాలకు వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. ఉన్నతాధికారుల దృషికి తీసుకపోయి ప్రత్యేక బృందంతో పూర్తిస్తాయి విచారణచేసి ఖాతాదారులకు న్యాయం జరిగేలా చూస్తామని అధికారులు పేర్కొన్నారు.

Updated Date - Aug 28 , 2024 | 12:12 AM