‘జనసేన గెలుపు.. అభివృద్ధికి మలుపు’
ABN , Publish Date - Apr 23 , 2024 | 12:13 AM
జనసేన గెలుపు రైల్వేకోడూరు అభివృద్ధికి ములుపు అని రైల్వేకోడూరు టీడీపీ ఇనచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి వరలక్ష్మి తెలిపారు.
రైల్వేకోడూరు(రూరల్) ఏప్రిల్ 22: జనసేన గెలుపు రైల్వేకోడూరు అభివృద్ధికి ములుపు అని రైల్వేకోడూరు టీడీపీ ఇనచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి వరలక్ష్మి తెలిపారు. సోమవారం పట్టణంలోని బలిజ వీధిలో గంగమ్మకు పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ . రైల్వేకోడూరులో జనసేన జెండా ఎగరేసి చంద్రబాబుకు బహుమతిగా ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నాయకులు బీజేపీ ఇనచార్జ్ గడ్డం చెంగల్ రాజు, జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, టీడీ పీ పట్టణ కన్వీనర్ పొకల మణి, మైనారిటీ నాయకులు పట్టాన మౌలా మహిళ నాయకురాలు నాగిరిపాడు మాజీ సర్పంచ కట్టా ఉమాదేవి, మైసూరివారిపల్లి సర్పంచ కారుమంచి సంయుక్త తదితరలు పాల్గొన్నారు.