వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి కలశారాధన
ABN , Publish Date - May 16 , 2024 | 11:26 PM
స్థానిక కదిరి రోడ్డులోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో స్వామి వారి ఆరాధన ఉత్సావాల్లో భాగంగా గురువారం ఆల యంలో కలశారాధన కార్యక్రమం నిర్వహించారు.
మదనపల్లె అర్బన, మే 16: స్థానిక కదిరి రోడ్డులోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో స్వామి వారి ఆరాధన ఉత్సావాల్లో భాగంగా గురువారం ఆల యంలో కలశారాధన కార్యక్రమం నిర్వహించారు. ఆలయకమిటీ అధ్యక్షుడు పి.లక్ష్మీనారాయణాచారి, నవయుగ స్వర్ణకారుల సంఘం, విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు డాక్టర్ అప్పినిపల్లె భాస్కరాచారిలు నిర్వహించారు. గురు వారం ఉదయం 5.30 గంటలకు సుప్రభాత సేవ, 9గంటలకు నాగదేవతల ఆరాధన, స్వామివార్లకు పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయంలో కలశారాధనతోపాటు హోమం నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు మహామంగలహారతి, భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులతోపాటు విశ్వబ్రాహ్మణులు తదితరులు పాల్గొన్నారు.